ఆ విషయంపై జగన్ ఏం సమాధానం చెప్తారు?: ఉమ
ABN , First Publish Date - 2021-04-08T15:51:41+05:30 IST
ఆ విషయంపై జగన్ ఏం సమాధానం చెప్తారు?: ఉమ
అమరావతి: ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వపెద్దల అక్కసు వెళ్ళగక్కుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. విశాఖలో పెద్దల పర్యవేక్షణలో పత్రికా ముద్రణ కేంద్రం కూల్చివేశారని అన్నారు. పాత తేదీలతో గోడలకు కొత్తనోటీసులు ముందే ఇచ్చామంటూ హైడ్రామా చేశారని చెప్పారు. పత్రికా వ్యవస్థపై మీ నేతల బరితెగింపు చర్యలపై జగన్ ఏం సమాధానం చెప్తారు? అని ఆయన ప్రశ్నించారు.