నిర్వాసితులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2021-06-13T01:05:53+05:30 IST
నిర్వాసితులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం: దేవినేని ఉమ
అమరాతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ముంపున పడేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గృహ నిర్మాణంలో పురోగతి, పరిహారం లేదని, అలాగే తరలించేదీ లేదన్నారు. మార్చికే ఇస్తామన్న సహాయ, పునరావాస నిధులు 2,748 కోట్లకు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిర్వాసితులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం.. వైఎస్ జగన్ అని ప్రశ్నించారు.