అక్రమాలపై ఎమ్మెల్యే వసంత సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-09-23T00:16:35+05:30 IST
అక్రమాలపై ఎమ్మెల్యే వసంత సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
అమరావతి: తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వం భక్తుల విశ్వాసాన్ని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. డిక్లరేషన్పై జగన్ సమాధానం చెప్పాలన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్లలో అక్రమాలపై ఎమ్మెల్యే వసంత సమాధానం చెప్పాలన్నారు. కొండపల్లి ఫారెస్ట్లో గ్రావెల్ అక్రమాలపై కిందస్థాయి అధికారులను సస్పెండ్ చేసి ఉన్నతాధికారులను ఎందుకు వదిలిపెట్టారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.