ఈ జగన్నాటకం ఎవరిని కాపాడడం కోసం?: ఉమ
ABN , First Publish Date - 2021-04-14T19:18:40+05:30 IST
ఈ జగన్నాటకం ఎవరిని కాపాడడం కోసం?: ఉమ
అమరావతి: బాబాయ్ మరణంపై లోకేష్ సవాల్కి జగన్ ఎందుకు తోకముడిచారు? మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. సొంత పత్రిక, ఛానల్లో గుండెపోటు అని ఫేక్ ప్రచారం చేశారని చెప్పారు. తర్వాత హత్య జరిగింది.. ఆధారాలు చెరిపేశారంటున్నారని చెప్పారు. బాబాయ్ మరణంవెనుక ఉన్న మిస్టరీ ఏంటో రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడంలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఈ జగన్నాటకం ఎవరిని కాపాడడం కోసం? అని ప్రశ్నించారు.