అందుకే నాపై కేసు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2021-04-11T20:20:46+05:30 IST

ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు.

అందుకే నాపై కేసు: దేవినేని ఉమా

తిరుపతి: ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిని అవమానిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను.. బయట పెట్టినందుకు తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందని ప్రశ్నించారు. ఇది రెండు గ్రూప్‌ల మధ్య గొడవ కాదని, కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలన్నారు.


వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టాలని దేవినేని ఉమా అన్నారు. బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టాలన్నారు. పక్క రాష్ట్రాలతో సీఎం జగన్ కుమ్మక్కయి నీటి వాటాలో ఏపీకి ద్రోహం చేశారని విమర్శించారు. రాయలసీమ రైతాంగానికి ఉరితాడు పడిందని, హక్కులు కోల్పోయామన్నారు. మోదీ, మమత, స్టాలిన్ తదితర నేతలు ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారన్నారు, సీఎం జగన్‌కు మాత్రం కరోనా భయమట అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-04-11T20:20:46+05:30 IST