ఆ నివేదికలే మా పారదర్శకతకు నిదర్శనం: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2020-09-25T18:11:29+05:30 IST
ప్రాజెక్టులపై తమ దారి అడ్డదారి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని..
అమరావతి: ప్రాజెక్టులపై తమ దారి అడ్డదారి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పోలవరంలో అవినీతి జరగలేదని కోర్టుకు జలవనరుల శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. కోర్టుకు ఇచ్చిన నివేదికలే తమ పారదర్శకతకు నిదర్శనమని అన్నారు. 70 శాతానికి పైగా పోలవరం పనులు టీడీపీ పూర్తి చేసిందన్నారు. గత 16 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.