డ్రగ్స్‌పై విచారణకు ఆదేశించి.. డీజీపీని రీకాల్ చేయాలి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-10-26T17:58:26+05:30 IST

ఏపీలో నిరసనకు దిగిన వారి గొంతులు నొక్కేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని..

డ్రగ్స్‌పై విచారణకు ఆదేశించి.. డీజీపీని రీకాల్ చేయాలి: దేవినేని ఉమ

అమరావతి : ఏపీలో నిరసనకు దిగిన వారి గొంతులు నొక్కేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఏపీలో నిరసన గొంతులు నొక్కేస్తున్నారు, అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతిపాలన విధించాలి. డ్రగ్స్‌పై విచారణకు ఆదేశించి, డీజీపీని రీకాల్ చేయాలి. దాడులపై సీబీఐ విచారణ చేయాలి. అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై టీడీపీ పోరును దాడులతో ఆపలేరు’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-26T17:58:26+05:30 IST