చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-13T18:05:21+05:30 IST

అమరావతి: ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారని.. ఒక్కో మహిళకు లక్షా ఎనభై వేలు ఇస్తామని..

చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా?: దేవినేని ఉమ

అమరావతి: ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారని.. ఒక్కో మహిళకు లక్షా ఎనభై వేలు ఇస్తామని.. లక్షా ఐదు వేలు ఎగనామం పెట్టారని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్. ఒక్కో మహిళకు ఇస్తానంది 1,80,000 అంటే 105000 ఎగనామం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం... అటకెక్కిన సంక్షేమం. స్వయం ఉపాధి, ఆదరణ ఊసేలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో రోడ్లు, హాస్టల్, సంక్షేమ భవనాల నిర్మాణం బంద్. చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


Updated Date - 2020-08-13T18:05:21+05:30 IST