రెసిడెన్షియల్ ప్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారమిచ్చారు?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-14T18:03:35+05:30 IST

అమరావతి: ప్రజా రాజధానిగా ఎన్నికలకు ముందే అమరావతి, సీఆర్డీఏ చట్టం జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

రెసిడెన్షియల్ ప్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారమిచ్చారు?: దేవినేని ఉమ

అమరావతి: ప్రజా రాజధానిగా ఎన్నికలకు ముందే అమరావతి, సీఆర్డీఏ చట్టం జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ప్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారంటూ ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ జగన్‌ను నిలదీశారు. ‘‘ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి, సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది. జీవో ఇచ్చి రెండు నెలలైనా 186 కోట్ల రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతుల త్యాగంతో కూడిన భూమితో సహా రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారు జగన్ గారు’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-14T18:03:35+05:30 IST