సింహాల చోరీలో ఆధారాలను ఎందుకు మాయం చేశారు?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-09-19T20:36:11+05:30 IST
అమరావతి: కనకదుర్గమ్మ రథంలో మూడు సింహాలు చోరీకి గురైన అంశం ఏపీని కుదిపేస్తోంది.
అమరావతి: కనకదుర్గమ్మ రథంలో మూడు సింహాలు చోరీకి గురైన అంశం ఏపీని కుదిపేస్తోంది. దీనిపై నేడు ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘దుర్గమ్మ రథంలో 3 సింహాల చోరీలో ఆధారాలను అధికారులు ఎందుకు మాయం చేశారు? మార్చి15న మెరుగు పెట్టినప్పుడు ఉన్న 4 సింహాలు, చోరీ విషయం తెలిసినా 3 రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సీసీ ఫుటేజ్లు ఏమయ్యాయి? ఎవరిని రక్షించడం కోసం ఈ ప్రయత్నాలు? బాధ్యులైన మంత్రిపై, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు.