హస్తిన చీకటి ఒప్పందం ఏమిటో..?! : దేవినేని

ABN , First Publish Date - 2021-06-11T20:51:26+05:30 IST

సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో స్పష్టం చేయాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

హస్తిన చీకటి ఒప్పందం ఏమిటో..?! : దేవినేని

విజయవాడ: సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో స్పష్టం చేయాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పోలవరం పనులు 71 శాతం పూర్తయ్యాయన్నారు. స్పిల్‌వే ద్వారా 2019 జూలైలో పోలవరం నుంచి నీళ్లను పంపించినట్లు, అదే నీటిని వైసీపీ ప్రభుత్వం మళ్లీ పంపించి మరోసారి ప్రారంభించటం శోచనీయమన్నారు. నిర్వాసితులకు ఎకరాకు పది లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నిర్వాసితులను బెదిరించి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జగన్‌ ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. హస్తినలో జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని నిలదీశారు. బాబాయిది గుండెపోటా..? మర్డర్ పోటా..? చెప్పాలని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2021-06-11T20:51:26+05:30 IST