ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా జగన్ తీరు : దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-06-12T23:21:54+05:30 IST

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా జగన్ తీరు : దేవినేని ఉమ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఒకలా..అధికారంలోకి వచ్చాక మరోలా జగన్ తీరు ఉందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ముంపున పడేసేలా వైసీపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. గృహ నిర్మాణంలో పురోగతి లేదన్నారు. నిర్వాసితులకు పరిహారం లేదు, వారిని తరలించేదీ లేదని చెప్పారు. మార్చికే ఇస్తామన్న సహాయ, పునరావాస నిధులు రూ. 2,748 కోట్లకు దిక్కులేదన్నారు. నిర్వాసితులపై జగన్‌‌కు ఎందుకంతా నిర్లక్ష్యమని దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 



Updated Date - 2021-06-12T23:21:54+05:30 IST