కొడాలి నాని బూతులు మాట్లాడేందుకే మంత్రి అయ్యారు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2021-10-27T01:18:02+05:30 IST
జగన్రెడ్డి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకం అపహాస్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కోట్ల రూపాయల ప్రజా సొమ్మును పేపర్ ప్రకటనలకే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.
కృష్ణా: జగన్రెడ్డి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకం అపహాస్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కోట్ల రూపాయల ప్రజా సొమ్మును పేపర్ ప్రకటనలకే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. పంట బీమా సొమ్ము దళారులు, వైసీపీ నేతల పాలవుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలు.. భోగస్ కేంద్రాలుగా మారాయని ఆయన విమర్శించారు. దోచుకోవడానికే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మైలవరం వచ్చారని ఆరోపించారు. కొడాలి నాని బూతులు మాట్లాడేందుకే మంత్రి అయ్యారని విమర్శించారు. రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి.. చూసుకుందామని సవాల్ విసిరారు.