దేవినేని ఉమాపై రెండు కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-11-25T21:39:00+05:30 IST
టీడీపీ నేత దేవినేని ఉమాపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం, విజయవాడ భవానీపురం పోలీసులు ఉమాపై కేసులు నమోదు చేశారు
అమరావతి: టీడీపీ నేత దేవినేని ఉమాపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం, విజయవాడ భవానీపురం పోలీసులు ఉమాపై కేసులు నమోదు చేశారు. గొల్లపూడిలో క్రాకర్లు పేల్చి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలో ఎన్హెచ్పై ట్రాఫిక్కు అంతరాయం.. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని మరో కేసు చేశారు. దేవినేనిపై ఐపీసీ 143, 341, 269, రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు.