యాదాద్రిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-12-26T01:40:19+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో ప్రభాత వేళ గోదాదేవిని ఆరాధిస్తూ అర్చకులు తిరుప్పావై పాశుర పఠనం జరిపారు. అనంతరం స్వామికి అభిషేకం, అర్చనలు, ఉత్సవ మండపంలో హోమ పూజలు, నిత్య కల్యాణం, సాయంత్రం అలంకార సేవలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. 

Updated Date - 2021-12-26T01:40:19+05:30 IST