భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి: టీటీడీ
ABN , First Publish Date - 2021-08-01T06:57:44+05:30 IST
కరోనా థర్డ్వేవ్కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ శనివారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
తిరుమల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కరోనా థర్డ్వేవ్కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ శనివారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. కొంతమంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా సంచరిస్తుండడం సమంజసం కాదని, ఈ కారణంగా తోటి భక్తులు ఇబ్బంది పడుతున్నారని టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో భక్తులు విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని కోరింది.