భక్తుల్లో అపోహలు కల్పించవద్దు: టీటీడీ

ABN , First Publish Date - 2021-11-25T02:30:21+05:30 IST

చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో

భక్తుల్లో అపోహలు కల్పించవద్దు: టీటీడీ

తిరుమల: చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈ కథనానికి, ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి ఫొటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదని, తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉందని టీటీడీ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-11-25T02:30:21+05:30 IST