అప్పన్న దర్శనానికి పీపీఈ కిట్లతో భక్తులు
ABN , First Publish Date - 2021-05-18T05:10:20+05:30 IST
కరోనా విజృంభణ నేపథ్యంలో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు స్వీయ భద్రత పాటిస్తున్నారు.
సింహాచలం, మే 17: కరోనా విజృంభణ నేపథ్యంలో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు స్వీయ భద్రత పాటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సింహాచ లేశుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు మాస్కులతో పాటు పీపీఈ కిట్లు ధరించి రావడం విశేషం. ఆలయ సిబ్బంది కూడా భక్తుల చేతుల్లో శానిటైజర్లను వేయడంతో పాటు అందరూ మాస్కులు ధరించేలా చూస్తున్నారు.