ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల పూజలు

ABN , First Publish Date - 2021-06-21T06:20:43+05:30 IST

కరోనా నేపథ్యంలో గత ఏప్రిల్‌ 22 నుంచి మూసి వేసి ఉంచిన మల్లన్న క్షేత్రం రెండు నెలల అనంతరం ఆదివారం తెరుచు కుంది.

ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల పూజలు
మల్లికార్జునస్వామిని దర్శించుకున్న భక్తులు

ఓదెల, జూన్‌ 20 : కరోనా నేపథ్యంలో గత ఏప్రిల్‌ 22 నుంచి మూసి వేసి ఉంచిన మల్లన్న క్షేత్రం రెండు నెలల అనంతరం ఆదివారం తెరుచు కుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో రెండు మండలాల నుండి భక్తులు ఆల యానికి చేరుకుని పూజలు నిర్వహించారు. భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వారలను దర్శించు కున్నారు. అలాగే మల్లన్నకు బోనాలను సమర్పించారు. ఇన్నాళ్లుగా ఆలయంలో నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి పునఃప్రారంభించారు. ఇప్పటి నుంచి క్షేత్రంలో అన్ని ఆర్జీత సేవలు నిర్వహించనున్నట్లు ఈవో రాజేంద్రం తెలిపారు. 

Updated Date - 2021-06-21T06:20:43+05:30 IST