గోదావరికి పూజలు చేసి తెప్పలను వదిలిన భక్తులు
ABN , First Publish Date - 2021-07-31T07:09:20+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరితీరం భక్తులతో పులకించింది.
బాసర, జూలై, 30 : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరితీరం భక్తులతో పులకించింది. బాసరతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు పెద్దసంఖ్యలో గోదారమ్మకు పూజలు నిర్వహించారు. గడ్డితో తయారు చేసిన తెప్పలకు పిండివంటకాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. ఇక్కడ వ్యవ సాయాఽ దారిత కుటుంబాలన్నీ గంగమ్మకు పూజలు నిర్వహించడం ఆన వాయితీ గా వస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు గోదారమ్మకు మొక్కులు చెల్లించారు.
తెప్పలను వదిలిన మహిళలు
కుంటాల, జూలై 30 : మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం మహిళలు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు.