దేవుల పల్లికి ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డు

ABN , First Publish Date - 2021-12-27T01:48:30+05:30 IST

జర్నలిజంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది.

దేవుల పల్లికి ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డు

హైదరాబాద్: జర్నలిజంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్‌ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. దేవులపల్లి అమర్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేస్తున్నారు, అమెరికా తెలుగు సంఘం(ఆటా) వేడుకలు - సేవా డేస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించింది.


తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ, ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం ఈ వేదిక ద్వారా అనేక సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాంస్కతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఎ.రేవంత్ రెడ్డి, ఎంఎల్ఏ రసమయి బాలకిషన్, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T01:48:30+05:30 IST