దీపావళికి నేతల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-11-04T16:17:14+05:30 IST

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారి ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

దీపావళికి నేతల శుభాకాంక్షలు

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారి ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ సహా పలువురు నేతలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 


* దేశ ప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రధాని ఆకాంక్షించారు. 


* తెలుగు ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని తెలిపారు. 


ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. టపాసుల కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఆనందంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - 2021-11-04T16:17:14+05:30 IST