పెళ్లి చేసుకొమ్మన్నందుకు కుటుంబాన్ని హతమార్చాడు

ABN , First Publish Date - 2021-06-30T22:28:07+05:30 IST

రూపాలి, సురేంద్ర సింగ్ (21) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకొమ్మని సురేంద్ర సింగ్‌ను రూపాలి అడుగుతోంది. పెళ్లి ఇష్టం లేని సురేంద్ర సింగ్.. రూపాలిని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నాలు

పెళ్లి చేసుకొమ్మన్నందుకు కుటుంబాన్ని హతమార్చాడు

భోపాల్: తనను పెళ్లి చేసుకొమ్మని ఇబ్బంది పెడుతుందని కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి.. తన ప్రేయసి సహా ఆమె కుటుంబానికి చెందిన మరో నలుగురి ప్రాణాలు తీశాడు. అనంతరం వారిని వ్యవసాయ భూమిలో పూడ్చి పెట్టాడు. అయితే వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులు కనబడటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ప్రకారం దర్యాప్తు చేయగా తాజాగా వారంతా విగత జీవులై కనిపించారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో జరిగిందీ దారుణం. నిందితుడు సురేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


దేవాస్ జిల్లాలోని నేమావర్ గ్రామానికి చెందిన మమతా బాయి (45) అనే మహిల సహా.. ఆమె ముగ్గురు కూతుర్లు రూపాలి (21), దివ్య (14), పూజ (15) ఒక కొడుకు పవన్ (14) కనిపించడం లేదని జూన్ 13న స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవాస్ ఏఎస్‌పీ సూర్యకాంత్ శర్మ ఈ కేసును సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయగా ఓ వ్యవసాయ భూమిలో పది అడుగుల లోతున ఐదు మృతదేహాలు కనిపించాయి. కొన్ని పరీక్షల అనంతరం ఈ ఐదు మృత దేహాలు కనిపించకుండా పోయిన ఐదుగురు కుటుంబ సభ్యులవేనని తేల్చి చెప్పారు.


రూపాలి, సురేంద్ర సింగ్ (21) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకొమ్మని సురేంద్ర సింగ్‌ను రూపాలి అడుగుతోంది. పెళ్లి ఇష్టం లేని సురేంద్ర సింగ్.. రూపాలిని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులను హతమార్చాలని నిర్ణయించుకుని అనుకున్నంత పని చేశాడు. ప్రమ వ్యవహారం తెలుసుకుని అనుమానంతో సురేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడిందని ఏఎస్‌పీ సూర్యకాంత్ శర్మ తెలిపారు.

Updated Date - 2021-06-30T22:28:07+05:30 IST