దివాసి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి జాగరణ భజన
ABN , First Publish Date - 2020-02-22T18:53:34+05:30 IST
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివాసి సమాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ భజన ఘంనంగా నిర్వహించారు.
- ‘మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా’
- దివాసి సమాజ్ సభ్యులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
- సమాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల నిధుల మంజూరికి హామీ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివాసి సమాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ భజన ఘంనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరైయ్యారు. ఎమ్మెల్యేను దివాసి పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివాసి సమాజ్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చెర్మెన్ రాంమోహన్ రెడ్డి, వైస్ చెర్మెన్ ఫరీద్, పోతురాజు, డాక్టర్ మధుసూదన్, దివాసి సమాజ్ భాద్యులు ఆకాష్, మదన్ సింగ్, దినేష్, వసంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.