పైపుల కంపెనీపై డీజీజీఐ దాడులు
ABN , First Publish Date - 2020-09-24T16:20:04+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో ఓ పైపుల కంపెనీపై డీజీజీఐ దాడులు జరుగుతున్నాయి. పైప్లైన్ ప్రాజెక్టు పేరుతో ఎలాంటి పరికరాలు సప్లై చేయకుండా
హైదరాబాద్: తెలంగాణలో ఓ పైపుల కంపెనీపై డీజీజీఐ దాడులు జరుగుతున్నాయి. పైప్లైన్ ప్రాజెక్టు పేరుతో ఎలాంటి పరికరాలు సప్లై చేయకుండా.. రూ.139 కోట్ల నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. నకిలీ ఇన్వాయిస్లతో కంపెనీ రూ.14 కోట్ల ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందింది. పక్కా సమాచారంతో హైదరాబాద్లో ఏక కాలంలో 4 చోట్ల డీజీజీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పంథాతో.. కంపెనీ టర్నోవర్ను నిర్వాహకులు పెంచుకున్నట్టు తెలుస్తోంది.
వీటి ద్వారా ప్రభుత్వరంగ ప్రాజెక్టులకు టెండర్లు వేసి.. నిర్మాణ ప్రాజెక్టులు కంపెనీ చేజిక్కించుకుంటోంది. అక్రమంగా వచ్చిన డబ్బుతో కంపెనీ లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్టు సమాచారం. కంపెనీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో జరిపిన..లావాదేవీలను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. లావాదేవీలకు ఉపయోగిస్తున్న రెండు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. కంపెనీ డైరెక్టర్ను అరెస్ట్ చేసిన డీజీజీఐ అధికారులు అక్టోబర్ 6 వరకు రిమాండ్ విధించారు.