హైకోర్టుకు హాజరైన డీజీపీ

ABN , First Publish Date - 2021-01-27T21:38:19+05:30 IST

హైకోర్టుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరైనారు. ఎస్సై పదోన్నతి విషయంలో కోర్టు ధిక్కార కేసులో డీజీపీ సవాంగ్, హోం సెక్రటరీ విశ్వజిత్

హైకోర్టుకు హాజరైన డీజీపీ

అమరావతి: హైకోర్టుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరైనారు. ఎస్సై పదోన్నతి విషయంలో కోర్టు ధిక్కార కేసులో డీజీపీ సవాంగ్, హోం సెక్రటరీ విశ్వజిత్, ఐజీ లడ్డా హైకోర్టుకు హాజరైనారు. డీజీ కార్యాలయంలో సబార్డినేట్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. మిమ్మల్ని ప్రతిసారి కోర్టుకు పిలవడం తమకు ఇబ్బందిగా ఉందని న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా 3 నెలలపాటు ఎందుకు అమలు చేయలేదో.. వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-01-27T21:38:19+05:30 IST