శారదక్క తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయింది : డీజీపీ

ABN , First Publish Date - 2021-09-17T19:34:44+05:30 IST

తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ, తెలంగాణ సెంటర్ కమిటీ మెంబెర్‌గా ఉన్న హరి భూషణ్ ఆయన సతీమణి జజ్జెరీ సమ్మక్క అలియాస్ శారదక్క పొలీసుల ముందు లొంగిపోయిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

శారదక్క తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయింది : డీజీపీ

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ, తెలంగాణ సెంటర్ కమిటీ మెంబెర్‌గా ఉన్న హరి భూషణ్ ఆయన సతీమణి జజ్జెరీ సమ్మక్క అలియాస్ శారదక్క పొలీసుల ముందు లొంగిపోయిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘1994లో 18 ఏళ్ళు నిండక ముందే పాండవ దళంలోకి శారదను హరి భూషణ్ తీసుకెళ్లాడు. 1995లో పార్టీ అనుమతితో శారదను పెళ్లి చేసుకున్నాడు. 1999లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్‌‌లో ప్లాటూన్ మెంబెర్‌‌గా పని చేశారు. చర్ల LOSలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ తగలడంతో ఓ కన్ను పోగొట్టుకుంది’’ అని తెలిపారు.


Updated Date - 2021-09-17T19:34:44+05:30 IST