కరోనా నివారణ చర్యలు చేపట్టాలి: డీజీపీ

ABN , First Publish Date - 2021-04-09T21:20:06+05:30 IST

కరోనా నివారణ చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా నివారణ చర్యలు చేపట్టాలి: డీజీపీ

హైదరాబాద్: కరోనా నివారణ చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున.. ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని మహేందర్‌రెడ్డి సూచించారు.

Updated Date - 2021-04-09T21:20:06+05:30 IST