మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటన
ABN , First Publish Date - 2021-12-01T23:42:46+05:30 IST
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. రేపటి నుంచి ఈ నెల 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. రేపటి నుంచి ఈ నెల 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నాయి. సారపాకలో కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలతో డీజీపీ సమావేశమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రా సరిహద్దుల్లో నిఘా పెంచాలంటూ సూచించారు. ప్రజాప్రతినిధులు అనుమతి లేకుండా పర్యటించొద్దని పోలీసులు సూచించారు.