వెండి సింహాల కేసు దర్యాప్తు అధికారులకు రివార్డు
ABN , First Publish Date - 2021-03-03T06:37:40+05:30 IST
కనకదుర్గమ్మ ఆలయం మహామండపం వద్ద ఉత్సవమూర్తుల రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును చేధించిన అధికారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం రివార్డును అందజేశారు.
విజయవాడ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కనకదుర్గమ్మ ఆలయం మహామండపం వద్ద ఉత్సవమూర్తుల రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును చేధించిన అధికారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం రివార్డును అందజేశారు. పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, డీసీపీ విక్రాంత్ పాటిల్, ఏసీపీ హనుమంతరావు, వన్టౌన్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం క్రైం ఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు, హెడ్కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావులను మంగళగిరిలో డీజీపీ కార్యాలయంలో అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.