డీజీపీ హోదాను దిగజార్చారు

ABN , First Publish Date - 2021-01-18T08:10:10+05:30 IST

‘చట్టాలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను గౌతమ్‌ సవాంగ్‌ నిర్వీర్యం చేస్తున్నారు. డీజీపీ హోదాను దిగజార్చారు. ఖాకీ దుస్తులకు బదులు వైసీపీ రంగు నీలం దుస్తులు వేసుకుంటే మంచిది’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

డీజీపీ హోదాను దిగజార్చారు

ఖాకీ బదులు ‘నీలం’ వేసుకుంటే మంచిది: అనిత


సింహాచలం, జనవరి 17: ‘‘చట్టాలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను గౌతమ్‌ సవాంగ్‌ నిర్వీర్యం చేస్తున్నారు. డీజీపీ హోదాను దిగజార్చారు. ఖాకీ దుస్తులకు బదులు వైసీపీ రంగు నీలం దుస్తులు వేసుకుంటే మంచిది’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆమె ఆదివారం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని పట్టుకోలేక, అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో టీడీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేవాలయాలను భక్తులే కాపాడుకుని, వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని అనిత పిలుపునిచ్చారు.

Updated Date - 2021-01-18T08:10:10+05:30 IST