మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి: డీజీపీ
ABN , First Publish Date - 2021-06-25T05:32:53+05:30 IST
ఎక్కడైతే మహిళలపై నేరాలు జరిగే అవకాశం ఉంటుందో ముందుగానే ఆ ప్రాంతాలను గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
కర్నూలు, జూన్ 24: ఎక్కడైతే మహిళలపై నేరాలు జరిగే అవకాశం ఉంటుందో ముందుగానే ఆ ప్రాంతాలను గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర డీజీపీ ఏపీ హెడ్ క్వార్టర్ మంగళగిరి నుంచి అన్ని రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలు, డీఎస్పీలు తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ ఫక్కీరప్ప ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ మహిళా పోలీసులు, మహిళ మిత్ర, గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో గస్తీలు నిర్వహించాలన్నారు. కళాశాలల వద్ద రాత్రివేళ్లల్లో ఎవరూ ఉండకుండా చూసుకునే విదంగా ముందస్తుగా నోటీసులు ఇవ్వాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, మైనర్ బాలికల సంరక్షణ, భద్రత కోసం దిశా యాప్ గురించి ప్రజలకు విసృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి మహిళతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలన్నారు. దిశా యాప్ ద్వారా వచ్చే ప్రతి సమస్య పట్ల సత్వరమే స్పందించాలని సూచించారు. నిమిషాల వ్యవధిలోనే బాదితులకు పోలీసులు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. సెబ్ అడిసినల్ ఎస్పీ గౌతమిశాలి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎంకే రాధాకృష్ణ, ఆయా సబ్ డివిజన్ల నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.