రేపు భద్రాద్రిలో దమ్మక్క సేవా యాత్ర
ABN , First Publish Date - 2020-07-04T10:22:58+05:30 IST
భదాచ్రలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం దమ్మక్క సేవా యాత్రను నిర్వహించనున్నారు.
కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయం
భద్రాచలం, జూలై 3 : భదాచ్రలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం దమ్మక్క సేవా యాత్రను నిర్వహించనున్నారు. అయితే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ సారి ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు భద్రాద్రి దేవస్థానం అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. భక్తులకు అనుమతి లేకుండా, దేవస్థానం వైదిక, పరిపాలన సిబ్బంది కొందరు మాత్రమే ఇందులో పాల్గొనేలా చూడాలని వైదిక కమిటీ సూచించిందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.