Dhananjaya De Silva: ఆ క్షణంలో అదే నిర్ణయించుకున్నా!
ABN , First Publish Date - 2021-07-30T00:00:36+05:30 IST
భారత్తో నిన్న జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక
కొలంబో: భారత్తో నిన్న జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ధనంజయ డి సిల్వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 34 బంతుల్లో సిక్స్, ఫోర్తో అజేయంగా 40 పరుగులు చేసిన ధనంజయ వీరోచిత ఇన్నింగ్సే లంకకు విజయాన్ని అందించిపెట్టింది.
మ్యాచ్ అనంతరం డి సిల్వ మాట్లాడుతూ.. తాము విజయమే లక్ష్యంగా బరిలోకి దిగినట్టు చెప్పాడు. విజయంలో భాగం పంచుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ఒత్తిడిని గట్టిగా అదిమిపెట్టామని, భారత్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ గట్టి ఫైటేనని డి సిల్వ పేర్కొన్నాడు. కాగా, భారత్తో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్లో శ్రీలంక ఇప్పటి వరకు సిరీస్ గెలుచుకోలేదు. నేటి మ్యాచ్లో కనుక గెలిస్తే తొలిసారి సిరీస్ గెలచుకున్నట్టు అవుతుంది.