ధనంజయ భారీ శతకం

ABN , First Publish Date - 2021-12-03T08:29:29+05:30 IST

వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక 279 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ధనంజయ భారీ శతకం

లంక రెండో ఇన్నింగ్స్‌ 328/8

గాలె: వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక 279 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ధనంజయ డిసిల్వ (153 బ్యాటింగ్‌) అజేయ శతకంతో రెండో ఇన్నింగ్స్‌లో లంక 119 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. వీరస్వామి పెరుమాళ్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆటకు శుక్రవారం చివరిరోజు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 253, లంక 204 పరుగులు చేసింది.

Updated Date - 2021-12-03T08:29:29+05:30 IST