ఎన్నిసాకులు చూపినా ధర్మమే గెలిచింది

ABN , First Publish Date - 2021-01-26T05:32:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరుపకుండా ఎన్ని కుంటిసాకులు చూపినా చివరకు ధర్మమే గెలిచిందని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగెనూరు సుధీర్‌రెడ్డి తెలిపారు.

ఎన్నిసాకులు చూపినా ధర్మమే గెలిచింది

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరుపకుండా ఎన్ని కుంటిసాకులు చూపినా చివరకు ధర్మమే గెలిచిందని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగెనూరు సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జమ్మలమడుగులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో యఽథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించి ఇప్పటికైనా  రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. పంచాయతీ పోరులో ముఖ్యంగా యువత, మహిళలు ముందుకు వచ్చి గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధికి పాటుపడాలని  ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T05:32:16+05:30 IST