కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2021-03-02T05:08:35+05:30 IST

గొర్రెల పంపిణీలో భాగంగా డీడీలు కట్టిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెల యూనిట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌, మార్చి 1: గొర్రెల పంపిణీలో భాగంగా డీడీలు కట్టిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెల యూనిట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కాపర్లకు చేయూత ఇవ్వడానికి గొర్రెల పంపిణీకి గాను ఒక్క యూనిట్‌కు రూ.31,250 చొప్పున సేకరించినా ఇంతరకు ఇవ్వలేదన్నారు.  మొదటి విడత డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్గం నారాయణ, కాండ్రె విశాల్‌, సుచిత్‌, రవీందర్‌, శంకర్‌, శ్రావణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:08:35+05:30 IST