బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా

ABN , First Publish Date - 2022-01-28T04:49:27+05:30 IST

ఖాతాదారుల పట్ల బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా
ఏపీజీబ్యాంకు ఎదుట ధర్నా చేపట్టిన బీజేపీ నేతలు

చక్రాయపేట, జనవరి 27: ఖాతాదారుల పట్ల బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాలతిమ్మ య్యగారిపల్లె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదురుగా నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి మాట్లాడు తూ బ్యాంకు అధికారులు ఖాతాదారుల పట్ల, డిపాజిట్‌ దారులపట్ల దురుసుగా వ్యవహరిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక అవినీతి ఆరోపణలు కూడా వస్తుండడంతో నిరసన వ్య క్తం చేశారు.

అర్హులకు రుణాలు మంజూరు చే యడంలో అలసత్వం, అనుమతి లేకుండా రైతు ల ఖాతాల నుంచి డబ్బు డిపాజిట్‌ చేసుకుంటు న్నారని ఆరోపించారు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ధర్నా ఉదృతం చేస్తామన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు హరిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి చక్రపాణి, మహదేవరెడ్డి, మండల అధ్యక్షుడు మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, సునీల్‌ కుమార్‌, మహేష్‌, మునిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:49:27+05:30 IST