బీజేపీ నాయకులను విడుదల చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2021-01-17T04:03:11+05:30 IST

నారాయణపేట పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమైన బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని కోరు తూ శనివారం స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర ఆ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు.

బీజేపీ నాయకులను విడుదల చేయాలని ధర్నా
దామరగిద్దలో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

దామరగిద్ద, జనవరి 16 : నారాయణపేట పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమైన బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని కోరు తూ శనివారం స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర ఆ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు సత్యనారాయణ, గోపాల్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ చౌక్‌ బజార్‌లో బహిరంగా చర్యకు సిద్ధమైన బీజేపీ నాయకులను టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులచేత అరెస్టు చేయించారని వారు ఆరోపిం చారు. నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయ కులు సంజీవ్‌గౌడ్‌, అశోక్‌, నారాయణ, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, మానిక్‌, వీరప్ప, శ్రీను, నాయకులు ఉన్నారు. అరెస్టయిన వారిలో నాయకులు సత్యయాదవ్‌, ప్రభాకర్‌వర్ధన్‌, రఘురామయ్యగౌడ్‌, నందునామాజీ, సిద్రామప్ప, బోయ లక్ష్మణ్‌ ఉన్నారు.

Updated Date - 2021-01-17T04:03:11+05:30 IST