ఆస్తిపన్ను పెంపు జీవో రద్దు చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2021-06-18T05:36:49+05:30 IST
ఆస్తి విలువ ఆధారంగా పెం చిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ 58, 59, 62, 63 వార్డుల సచివాలయా ల వద్ద సీపీఎం నాయకులు గురువారం ధర్నా చేశారు.
మల్కాపురం, జూన్ 17: ఆస్తి విలువ ఆధారంగా పెం చిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ 58, 59, 62, 63 వార్డుల సచివాలయా ల వద్ద సీపీఎం నాయకులు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మల్కాపురం జోన్ సీపీ ఎం కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను, చెత్తపన్ను పెంచుతూ విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.