ధవళేశ్వరం బ్యారేజీకి తగ్గిన గోదావరి ఉధృతి
ABN , First Publish Date - 2021-09-12T13:59:24+05:30 IST
ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం
తూర్పు గోదావరి: ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీలో 10.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది. ధవళేశ్వరం 175 గేట్లను ఎత్తి 7.85 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇంకా వరద ముంపులోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి.