ధవళేశ్వరం వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి ఉధృతి
ABN , First Publish Date - 2020-08-11T22:27:58+05:30 IST
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వర ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 10.30 అడుగులకు నీటి మట్టం పెరిగింది.
రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వర ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 10.30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు లక్షా 46వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 12,300 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు.