ఇదో గొప్ప గౌవరం: శిఖర్ ధవన్

ABN , First Publish Date - 2021-06-11T23:10:42+05:30 IST

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌కు ప్రమోషన్ వచ్చింది. వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు

ఇదో గొప్ప గౌవరం: శిఖర్ ధవన్

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌కు ప్రమోషన్ వచ్చింది. వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత జట్టుకు ధవన్ సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్సీ పగ్గాలను బీసీసీఐ గబ్బర్‌కు అందించింది. భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. శ్రీలంక పర్యటన వచ్చే నెల 13న ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడనుంది. 20 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన బీసీసీఐ పలువురు దేశవాళీ ఆటగాళ్లకు చోటు కల్పించింది. శ్రీలంక టూర్‌కు బీసీసీఐ తనను కెప్టెన్‌గా నియమించడంపై ధవన్ మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. ధవన్‌కు కెప్టెన్సీ పగ్గాలు లభించడంపై ఆయన అభిమానులు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.  


శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఇదే: శిఖర్ ధవన్ (కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె.గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. 

నెట్ బౌలర్లు: ఇషన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్‌జీత్ సింగ్ 

Updated Date - 2021-06-11T23:10:42+05:30 IST