విశిష్ట సాహితీ సేవకుడు ‘ధూళిపాళ్ల’

ABN , First Publish Date - 2020-12-05T05:42:40+05:30 IST

జిల్లా సాహి తీరంగానికి విశేష సేవ లందించిన గొప్ప వ్యక్తి ధూళిపాళ్ల హనుమంత రావు అని నవ్యాంధ్ర రా ష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర గౌరవా ధ్యక్షురాలు తేళ్ల అరుణ పేర్కొన్నారు.

విశిష్ట సాహితీ సేవకుడు ‘ధూళిపాళ్ల’
నివాళులర్పిస్తున్న సాహితీవేత్తలు


ఒంగోలు(కల్చరల్‌), డి సెంబరు 4 : జిల్లా సాహి తీరంగానికి విశేష సేవ లందించిన గొప్ప వ్యక్తి ధూళిపాళ్ల హనుమంత రావు అని నవ్యాంధ్ర రా ష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర గౌరవా ధ్యక్షురాలు తేళ్ల అరుణ పేర్కొన్నారు. నరసం, నాగభైరవ సాహిత్యపీఠం ఆధ్వర్యంలో హనుమంతరా వు ప్రథమవర్థంతి సభ ఒంగోలులోని హౌసింగ్‌బోర్డులో గల స్వధారగృహలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. విద్యాశాఖాధికారిగా పనిచేసిన హనుమంతరా వుకు సాహిత్యం పట్ల ఎంతో మక్కువని, అనేక సాహిత్యసంస్థలకు ఆయన సహాయ సహకారాలు అందజేశారని కళామిత్ర అధ్యక్షుడు డాక్టర్‌ నూనె అం కమ్మరావు కొనియాడారు. కార్యక్రమంలో మిడసల మల్లిఖార్జునరావు, పిన్ని వెంకటేశ్వర్లు, నూకతోటి శరత్‌, బీరం అరుణ, యు.వి.రత్నం, సూర్యకుమారి, ఎం.నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-05T05:42:40+05:30 IST