ధోనీ చేతిలో పడిన బ్యాట్.. వేలంలో ఎంత పలికిందంటే?

ABN , First Publish Date - 2020-08-16T04:25:03+05:30 IST

పిండికొద్దీ రొట్టె అంటారు. అలాగే ఆట కొద్దీ ఆటగాడి వస్తువుల విలువ. ఈ లెక్కన ప్రపంచంలోని మిగతా క్రికెటర్లందరినీ ధోనీ వెనక్కి నెట్టేశాడు.

ధోనీ చేతిలో పడిన బ్యాట్.. వేలంలో ఎంత పలికిందంటే?

ముంబై: పిండికొద్దీ రొట్టె అంటారు. అలాగే ఆట కొద్దీ ఆటగాడి వస్తువుల విలువ. ఈ లెక్కన ప్రపంచంలోని మిగతా క్రికెటర్లందరినీ ధోనీ వెనక్కి నెట్టేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన సందర్భంగా ధోనీ గురించి ఓ ఆసక్తికర విషయం. 2011 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌ చివర్లో సిక్సర్‌తో జట్టును ధోనీ గెలిపించిన వైనం గుర్తుందిగా. ఆ సిక్సర్ కొట్టిన బ్యాట్‌ను ఆ తర్వాత వేలం వేశారు. అప్పుడది ఎంత ధర పలికిందో తెలుసా? అక్షరాలా లక్ష యూరోలు. అప్పటి లెక్కల్లో ఇది రూ.72లక్షలపైమాటే. దీన్ని ముంబైకి చెందిన బ్రోకరేజ్ ఫిర్మ్ ఆర్కే గ్లోబల్ కొనుగోలు చేసింది. ప్రపంచకప్ జరిగిన మూడు నెలల తర్వాత లండన్‌లో జరిగిన ఓ ఛారిటీ డిన్నర్‌లో ఈ బ్యాట్‌ను వేలంవేశారు. ఈ సొమ్మంతా ధోనీ భార్య సాక్షికి చెందిన చారిటబుల్ ఆర్గనైజేషన్‌కు వెళ్లింది.

Updated Date - 2020-08-16T04:25:03+05:30 IST