dubai: ఏడుస్తున్న చిన్నపిల్లలకు ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ చేసిన బంతిని బహుమతిగా ఇచ్చారు...వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-10-11T15:51:31+05:30 IST

ఐపీఎల్ 2021 క్రికెట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన తర్వాత ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులకు ఎంఎస్ ధోని తాను ఆటోగ్రాఫ్ చేసిన బంతిని అందించారు...

dubai: ఏడుస్తున్న చిన్నపిల్లలకు ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ చేసిన బంతిని బహుమతిగా ఇచ్చారు...వీడియో వైరల్

దుబాయ్ : ఐపీఎల్ 2021 క్రికెట్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన తర్వాత ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులకు ఎంఎస్ ధోని తాను ఆటోగ్రాఫ్ చేసిన బంతిని అందించారు. మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ధోనీ ఒక ఫోర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్  విజయానికి దారి తీసిన తర్వాత ఇద్దరు చిన్నారి అభిమానులు ఏడుస్తూ కనిపించారు. దానికి ప్రతిస్పందించిన ధోని ఆటోగ్రాఫ్ చేసిన బాల్స్ అందజేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం అనంతరం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న ఓ అమ్మాయికి ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేసిన బంతిని అందించారు.


ఆదివారం రాత్రి ధోని కొట్టిన ఫోర్ చూసిన అభిమానులతోపాటు అతని భార్య సాక్షి ధోని, కుమార్తె జీవా ధోనీలు ఆశ్చర్యపోయారు.ధోని కొట్టిన షాట్ చూసిన కొంతమంది అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం, ఇద్దరు పిల్లలు కన్నీళ్లు పెట్టుకోవడం, వారికి ఆటోగ్రాఫ్ చేసిన బంతులను ధోని అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోనీ గొప్ప ఫినిషర్, ‘‘రాజు తిరిగి వచ్చాడు’’ అంటూ ధోనిని ప్రశంసిస్తూ కోహ్లీ ట్వీట్ చేశారు.  


Updated Date - 2021-10-11T15:51:31+05:30 IST