అభిమానులకు అతనే ప్రపంచం.. ధోనీకి బర్త్డే విషెస్ చెప్పిన సెహ్వాగ్
ABN , First Publish Date - 2020-07-08T02:36:22+05:30 IST
టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ 39వ పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ 39వ పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధోనీ గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే భారతజట్టు మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ధోనీకి బర్త్డే విషెస్ చెప్పాడు. ‘ఒక్కో తరంలో ఒక్కో ఆటగాడు మైదానంలో దిగుతాడు. ప్రపంచం మొత్తం అతనితో కనెక్ట్ అయిపోతుంది. అతను మనవాడే అనిపిస్తుంది’ అని ధోనీ గురించి చెప్పాడు. ‘ప్రపంచంలోని అభిమానులకు తనే ఓ ప్రపంచం అయిన ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. కాగా, ధోనీ జన్మదినం సందర్భంగా విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ‘హెలికాప్టర్ 7’ అనే పాటను విడుదల చేశాడు.