MS Dhoni: ప్రాక్టీస్ మ్యాచ్‌తోనే ప్రత్యర్థులకు వార్నింగ్

ABN , First Publish Date - 2021-09-19T00:54:22+05:30 IST

ఐపీఎల్ రెండో విడత ప్రారంభానికి ముందు ప్రత్యర్థులకు ధోనీ వార్నింగ్ పంపాడు. ప్రాక్టీస్ గేమ్‌లో ధోనీ కొట్టిన

MS Dhoni: ప్రాక్టీస్ మ్యాచ్‌తోనే ప్రత్యర్థులకు వార్నింగ్

దుబాయ్: ఐపీఎల్ రెండో విడత ప్రారంభానికి ముందు ప్రత్యర్థులకు ధోనీ వార్నింగ్ పంపాడు. ప్రాక్టీస్ గేమ్‌లో ధోనీ కొట్టిన అద్భుతమైన సిక్సర్‌ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. స్పిన్నర్లు, పేసర్లను ధోనీ అలవోకగా ఎదుర్కొన్నాడు. అతడు బ్యాట్ ఝళిపిస్తుంటే మునుపటి ధోనీ కనిపించాడని అభిమానులు  సంబరపడిపోతున్నారు. 360 డిగ్రీలో ఆడుతూ గ్రౌండ్ నలుమూలలకు బంతిని పంపాడు. తనలో పస ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. 


ఐపీఎల్ తొలి భాగంలో ధోనీ ఏడు మ్యాచుల్లో కలిపి 37 పరుగులు మాత్రమే చేశాడు. వాటి స్ట్రైక్ రేట్ 123.33 ఉన్నప్పటికీ పెద్ద స్కోర్లు సాధించడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ ధోనీ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించి రెండింటిలో ఓడింది. రేపటి (ఆదివారం) నుంచే ఐపీఎల్ రెండో విడత ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య యూఏఈలో జరగనుంది. 



Updated Date - 2021-09-19T00:54:22+05:30 IST