ధోనీ జర్నీ అసామాన్యం.. లక్ష్మణ్ కామెంట్స్!
ABN , First Publish Date - 2020-08-16T03:52:30+05:30 IST
అంతర్జాతీయ క్రికెట్కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలికాడు.
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలికాడు. దీనిపై భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఏదో చిన్న టౌన్ కుర్రాడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ విన్నర్గా ధోనీ మారిన తీరు అసమాన్యమని కొనియాడాడు. ‘ధోనీ జర్నీ అద్భుతం, అసామాన్యం. మాకు ఎన్నో మధుర జ్ఞాపకాలందించావు. మహీ, నీతో కలిసి ఆడే అవకాశం రావడం నా అదృష్టం. మనం కలిసి ఆడిన రోజుల్ని ఎప్పటికీ మర్చిపోను’ అని పేర్కొన్నాడు.