రాజమండ్రి డెల్టా ఆస్పత్రిలో ధూళిపాళ్ల’కు వైద్యం
ABN , First Publish Date - 2021-05-15T09:47:20+05:30 IST
రాజమండ్రి డెల్టా ఆస్పత్రిలో ధూళిపాళ్ల’కు వైద్యం
కోర్టు ఆదేశాలతో తరలించిన జైలు అధికారులు
విజయవాడ, మే 14(ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆ సంస్థ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ను అక్కడి డెల్టా ఆస్పత్రికి తరలించారు. కొవిడ్తో బాధపడుతున్న ఆయన్ను వైద్యులు సూచించిన ప్రకారం విజయవాడలో గానీ, రాజమండ్రిలో గానీ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని ఏసీబీ కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఆయన్ను శుక్రవారం అక్కడి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నరేంద్రకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందజేయడంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 20వ తేదీన కోర్టుకు నివేదిక అందజేయాలని న్యాయమూర్తి నిర్దేశించినట్లు ఆయన తరఫు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.